జనం న్యూస్ జూన్ 29 నాగర్ కర్నూలు జిల్లా: కోడేరు మండలం: ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి అర్హుడూ తన ఓటు హక్కును కాపాడుకోవాలని నాగులపల్లి గ్రామ సర్పంచ్ మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఓటరు వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని, సవరణ ప్రక్రియను నిర్వహించాలని ఆయన కోరారు.