ప్రణవ్ బాబు, నరేందర్ రెడ్డి వార్డుల పర్యటన

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుల సందడి

జనం న్యూస్, జూన్ 30( జిల్లా ఇంచార్జ్ ), జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం 4, 5, 19 వార్డుల్లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (సర్ ) కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు, కరీంనగర్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎల్‌వో (బి ఎల్ ఓ )తో మాట్లాడి వార్డు ప్రజలకు ఎస్‌ఐఆర్ ఫారాలను అందజేశారు. ప్రతి అర్హ ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రజలు సహకరించాలని సూచించారు.అనంతరం మాజీ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దేశిని స్వప్నకోటి నివాసానికి మర్యాదపూర్వకంగా వెళ్లారు.వారికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *