ఘనంగా వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబరు 3 ముద్దనూరు : స్థానిక మండల కేంద్రంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి, జననేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ చిత్రపటానికి వైసిపి మండల కన్వీనర్ ఎన్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పేద ప్రజల ఆరాధ్య దైవంగా, నిరుపేదల పెన్నిధిగా నిలిచిన రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.రైతు బాంధవుడిగా ఉచిత విద్యుత్, అపర భగీరథుడిగా జలయజ్ఞం, పేదల పాలిట సంజీవనిగా ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి ఎన్నో చారిత్రాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన మంచి మనసున్న మహారాజు వైఎస్సార్ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకై పార్టీ శ్రేణులన్నీ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నాయకులు,భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *