
జనం న్యూస్ 3/సెప్టెంబర్ టేక్మాల్ (ప్రతినిధి)టేక్మాల్ మండలంలో ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియకు సంబంధించి అధికారులు బుధవారం పత్రాలను స్వీకరించారు. ఎంపీడీవో సత్యనారాయణ ఎస్ఐఆర్ పత్రాలను స్వీకరించి దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించారు. నోటీసులు అందిన ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలో సరైన ఆధారాలతో ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని సూచించారు.