జమ్మికుంట మున్సిపల్ కమిషనర్‌గా మల్లికార్జున స్వామి బాధ్యతలు స్వీకారం

జనం న్యూస్, మే 2(జిల్లా ఇంచార్జ్ ) రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కమిషనర్‌ల బదిలీల్లో భాగంగా జమ్మికుంట మున్సిపల్ కమిషనర్‌గా బదిలీపై వచ్చిన గుట్టల మల్లికార్జున స్వామి శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి. రాజిరెడ్డి, జె.ఏ.ఓ రాజశేఖర్ రెడ్డి, టిపివో శ్రీధర్, టిపిఎస్ రాజ్ కుమార్, టిపిబివో దీపిక, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, ఆర్‌ఐ భాస్కర్, సీనియర్ అసిస్టెంట్ వాణి, శ్రీనివాస్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *